హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, ఏప్రిల్ 14, 2016

శ్రీ సీతా రామ స్తోత్రం

శ్రీ సీతా రామ స్తోత్రం

అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!

రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!

పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!

కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!

చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!

చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!

శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!

దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!

అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!

అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!

ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!

ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం

శ్రీరామనవమి వ్రతము

శ్రీరామనవమి వ్రతము 

గణపతిపూజ
ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్, 
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!
సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|
అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా !
తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి||
యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ||
స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|
పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం||
సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం|
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం|
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః||
యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||
సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే|| 
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః| 
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 
* ప్రాణాయామము: 
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.
ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే. 
కలశారాధన: 
(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను). 
శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః
మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః
ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః 
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం. 
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.) 
ప్రాణప్రతిష్ఠ:
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు | 
ధ్యానం:
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 
శుద్దోదక స్నానం: 
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి | 
వస్త్రం:
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి | 
యజ్ఞోపవీతం:
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి | 
గంధం:
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి | 
అక్షతాన్:
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి | 
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి. 
ధూపం:
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం |
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి. 
దీపం:
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం |
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి || 
నైవేద్యం:
మం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || 
తాంబూలం:
ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి | 
నీరాజనం:
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం || 
మంత్రపుష్పం:
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి | 
ప్రదక్షణ నమస్కారం:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ. 
శ్రీరామనవమి వ్రత పూజాప్రారంభః
ధ్యానం: 
శ్లో || కోమలాంగం విశాలాక్షం ఇంద్ర నేల సమప్రభం,
దక్షిణాంగే దశరధం పుత్రాపేక్ష ణత త్పరం,
వృష్టంతో లక్ష్మణందేవం సచ్ఛత్రం కనక ప్రభం,
పార్మ్యే భరత శత్రఘ్నె తాళ వృతక రావుభౌ,
అగ్రేవ్యగ్రం హనుమంతం రామానుగ్రహ కాంక్షిణం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి 
ఆవాహనం:
శ్లో || విశ్వేశం జానకీ వల్లభ ప్రభుం కౌసల్యా తనయం
విష్ణుం శ్రీరామంప్రకృతే: పరం ||
సహస్ర శీర్షే త్యావాహనం, శ్రీరామాగచ్ఛ భగవన్ర ఘువీరన్న పోత్తమ ||
జానక్యా సహరాజేంద్రా సుస్థిర భవ సర్వదా
రామభద్ర మహేష్వాస రావణాంతక రాఘవ
యావతన్నాజాం సమాప్యే హంతాత్సన్ని హితోభవ ||
రఘునాయక రాజర్షి నమోరాజీవ లోచన,
రఘునంద నమోదేవ శ్రీరామాభి మభోభవ ||
ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి.
ఆసనం:
శ్లో || రాజాధ రాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే రత్న సింహాసనం తుభ్యం
దాస్యామి స్వీకురు ప్రభో || పురుషయే వేద మిత్యాసనం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. 
అర్ఘ్యం:
శ్లో || పరిపూర్ణ పరానంద నమోర మాయవేధనే,
గృహాణర్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణోజనార్దన, త్రిపాదే త్యర్ఘ్యం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. 
పాద్యం :
శ్లో || త్రైలోక్యపావనానంత నమస్తే రఘు నాయక
పాద్యం గృహాణరాజర్షే నమోరాజీవ లోచన ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః పాద్యం సమర్పయామి. 
ఆచమనీయం:
శ్లో || నమస్సత్యాయ శుద్దాయ నిత్యాయ జ్ఞానరూపిణే,
గృహాణాచమనంనాధ సర్వలోకైక నాయక, తస్మాద్విరా ఒచ్యాచ మనం,
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. 
మధుపర్కం :
శ్లో || నమశ్శ్రీ వాసుదేవాయ తత్వ జ్ఞాన స్వరూపిణే,
మధుపర్కం గృహాణే దం జానకీ పతయే నమః
ఓం శ్రీ రామచంద్రాయ నమః మధుపర్కం సమర్పయామి 
పంచామృత స్నానం :
శ్లో || పంచామృత మయానీతం పయోదది ఘ్రుతం మధు
శర్క రాజల సంయుక్తం శ్రీ రామః ప్రతి గృహ్యాతాం .
ఓం శ్రీ రామచంద్రాయ నమః పంచామృత స్నానం సమర్పయామి 
శుద్దోదక స్నానం :
శ్లో || ఆపోహిష్టామ యోభువః స్థాన ఊర్జే దధాతన|
మహేరణాయ చక్షసే| యోవశ్శివతమొరసః||
తస్యభాజయతెహనః వుశాతీరివ మాతరః|
తస్మాదరంగమామవో యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
ఓం శ్రీ రామచంద్రాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి . 
వస్త్ర యుగ్మం :
శ్లో: స్వర్ణాంచలం స్వర్ణ విచిత్ర శోభితం|
కౌశేయ యుగ్మం పరికల్పితంమయా||
ఓం శ్రీ రామచంద్రాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి 
యజ్ఞోపవీతం :
శ్లో || బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మ సూత్రకం|
గృహాణ భగవాన్ విష్ణో సర్వేష్ట ఫలదోభవ|| 
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఉపవీతం సమర్పయామి 
గంధం :
శ్లో || శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం|
విలేపన సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం||
ఓం శ్రీ రామచంద్రాయ నమః గంధాన్ సమర్పయామి 
ఆభరణం :
శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |
భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆభరణాన్ సమర్పయామి 
పుష్ప సమర్పణ :
శ్లో || చామంతి కావకుల చంపక పాటలా| పున్నాగ జాజి రసాల మల్లికై|
బిల్వ ప్రవాళ తులసీదళ పుష్పా త్వాం పూజయామి జగదీశ్వర|| 
ఓం శ్రీ రామచంద్రాయ నమః పుష్పాణి సమర్పయామి. 
అధాంగ పూజ
శ్రీ రామ చంద్రాయ - పాదౌ పూజయామి
రాజీవ లోచనాయ - గుల్భౌ పూజయామి
రావణాంత కాయ - జానునీ పూజయామి
వాచస్సతయే - ఊరూ పూజయామి
విశ్వరూపాయ - జంఘే పూజయామి
లక్ష్మణాగ్ర జాయ - కటిం పూజయామి
విశ్వమూర్తయే - మేడ్రం పూజయామి
విశ్వామిత్ర ప్రియామి - నాభి పూజయామి
పరమాత్మనే - హృదయం పూజయామి
శ్రీకంటాయ - కంటం పూజయామి
సర్వాస్త్రదారిణే - బాహూ పూజయామి
రఘుద్యహాయ - ముఖం పూజయామి
పద్మనాభాయ - జిహ్వం పూజయామి
దామోద రాయ - దన్తాం పూజయామి 
శ్రీరామ అష్ట్తోత్తర శతనామావళి 
ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణ తత్సరాయ నమః
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభి ష ణపరిత్రాణాయ నమః
ఓం హరకోదండ ఖండ నాయ నమః
ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
ఓం తాతకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభే షజాయ నమః
ఓం త్రిమూర్త యే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండ కారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృ భక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేoద్రి యాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జిత మిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం వృక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంత త్రాణవర దాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాద్ దేవాయ నమః
ఓం మృత వానరజీవనాయ నమః
ఓం మాయామారీ చహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదే వస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
ఓం ఆది పురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహా పురుషాయ నమః
ఓం పుణ్యోద యాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమిత భాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంత గుణ గంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్త మాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూ జితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుంద రాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీత వాసనే నమః
ఓం ధనుర్ధ రాయ నమః
ఓం సర్వయజ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణ వర్ణ తాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః
ఓం సర్వావగునవర్ణ తాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదే వత్మకాయ నమః
ఓం పరస్మై నమః
శ్రీ రామాష్టోత్తర శత నామావళి సమాప్తమ్ 
ధూపం :
శ్లో || వనస్పతి రసోద్భూతో గంధాద్యో గంద ముత్తమ
రామచంద్ర మహీపాల ధూపోయం ప్రతిగ్నహ్యతాం యత్పురుష మితి ధూపం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః ధూప మాఘ్రాపయామి. 
దీపం :
శ్లో || జ్యోతిషాం పతయే తుభ్యం నమోరామాయ వేధసే
గృహానదీ పకం చైవ త్రైలోక్య తిమిరాపహం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి 
నైవేద్యం :
శ్లో || ఇదంది వ్యాన్న మమ్రతంర సైషజ్భి స్సమన్వితం,
రాచ మంద్రేశ నైవేద్యం సీతాశ ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః నైవేద్యం సమర్పయామి 
తాంబూలం :
శ్లో || నాగవల్లీ దళైర్యక్తం పూగీ ఫల సమన్వితం,
తాంబూలం గృహ్యతాంరామ కర్పూరాది సమన్వితం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః తాంబూలం సమర్పయామి 
నీరాజనం :
శ్లో: నృత్త్యైర్గి తైశ్చవా ద్యైశ్చ పురాణపట నాదిభి:
రాజో పచారైరభి లైస్సంతుష్టోభవ రాఘవ ||
మంగళార్దం మహీపాల నీరాజన మిదంహరే
సంగ్రహాణ జగన్నాధ రామచంద్ర నమోస్తుతే కర్పూర నీరాజనం || 
మంత్ర పుష్పం :
శ్లో || సర్వలోక శరణ్యాయ రామ చంద్రాయ వేదసే
బ్రహ్మనందైక రూపాయ సీతాయ|| పతయే నమః యజ్ఞే నేతి పుష్పాంజలి: ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయ 
నమస్కార :
శ్లో: నమోదేవాది దేవాయ రఘునాధాయ
చిన్మయానంద రూపాయ నీతాయః పతయే నమః సప్తా స్యాసన్నితిన మస్కారః 
పూజాఫల సమర్పణమ్:
శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. 

వ్రత కధా ప్రారంభము :

శివ భక్తుడైన అగస్త్యమ హర్ష సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ ' సుతేష్ణ మునీ ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను.అని ఈవిధముగా చెప్పుట మొదలు పెట్టెను. 
చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి,
గోవు. భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను. ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలొ కములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపిఐన నూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్ని జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభి రాముడగు శ్రీరామునివలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును. 
శ్రీ రామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటి కంటే ఉత్తమమైన ఈవ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ ( బొమ్మ) కు పూజ పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు. 
ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో (అనగా బంగారం) దెనిచే నైననూ పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వపాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌర వాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామమూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్ర ములలోను, ' రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్త మమని స్కాంద పురాణము. మోక్ష ఖండనము లోని రుద్ర గీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు(శివుడు) చెప్పుచున్నాడు. 
ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున ( అంటె కుడి చెవియందు) ' శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు. 
కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొ|| న లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ(బొమ్మ) దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్ర చిత్తుడై (అంటే మనస్సును దేవుని యందే నిలిపిన వాడై) జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి (అంటే మరల పూజించి) సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. (సంతోషించును) కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును. 
రామమంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి (అంటే భోజనము ఇంకా ఆహార పదార్దములు ఏమియు తీసుకొనక) శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చల మైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని ' అగస్త్య మహర్షి వివరించెను.

గురువారం, ఏప్రిల్ 07, 2016

సోమవారం, ఏప్రిల్ 04, 2016

తిధ్యానుసారం

తిధులలో చేయవలసిన దేవతా వ్రతాలు, పూజలు.....!!

ఏ దేవతలను ఏ తిథినాడు ఆరాధిస్తే ఎంత మంచి పుణ్య ఫలం కలుగుతుంది? అనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం వరాహ పురాణంలో కనిపిస్తుంది. అందులో వరాహమూర్తిగా ఉన్న శ్రీమహావిష్ణువు స్వయంగా తిథుల విశేషాలను భూదేవికి వివరించి చెప్పాడు.

దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కనుక తిథులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని ఆరాధిస్తే పుణ్య ఫలం దక్కుతుంది. భక్తులు ఆ రోజున పాలు మాత్రం తాగి ఉపవాసం ఉండి అగ్నిని ఆరాధించాలి. ఆ తర్వాత విదియ నాడు అశ్వనీ దేవతలను ఆరాధించాలి. ఈ తిథి నాడే అశ్వనీ దేవతలు జన్మించారు. సంవత్సర కాలం పాటు ఆ దేవతలను ఉద్దేశించి విదియ వ్రతం నియమ నిష్టలతో చేస్తే అందమైన రూపం కలుగుతుంది.

తదియ నాడు గౌరీ దేవిని ఆరాధించాలి. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటైంది. తదియ నాడు గౌరీ కల్యాణం జరిగిన కారణంగా గౌరీ దేవికి ఈ తిథి అంటే ఎంతో ఇష్టం. చవితి వినాయకుడు పుట్టిన తిథి. ప్రత్యేకంగా వినాయక చవితి నాడే కాక ప్రతి శుద్ధ చవితి నాడు వినాయక పూజ చేయవచ్చు.

పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగ దేవతకు పంచమి తిథి అంటే ఎక్కువ ఇష్టం. ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి సంవత్సర కాలం పాటు నాగులను పూజిస్తూ ఆ పంచమి నాడు పులుపు లేని భోజనం చేస్తే నాగుల వల్ల భయం ఉండదు. నాగుల చవితి, నాగ పంచమి అనేవి రెండూ నాగదేవతకు ఇష్టమైనవే. షష్ఠి కుమారస్వామి జన్మ తిథి. ఆనాడు అర్చన చేస్తే కుమార స్వామికి ప్రీతికరం.

సప్తమి సూర్యుడి జన్మ తిథి. రథ సప్తమి నాడే కాక ప్రతిశుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. దుర్గా దేవి నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమి. అందుకే ఆనాడు అష్ట మాతృకలను, దుర్గా దేవిని ఆరాధిస్తే ఎక్కువ పుణ్య ఫలం దక్కుతుంది. శివుడు అంధకాసురుడితో పోరాడేటప్పుడు లోక కల్యాణం కోసం ఆయనకు సహకరించేందుకే అష్ట మాతృకల ఆవిర్భావం జరిగింది. అష్టమి నాడు కేవలం మారేడు చివుళ్ళను తిని అష్ట మాతృకలను పూజిస్తే ఆ తల్లులు కష్టకాలంలో ఆదుకుంటారు.

నవమి కూడా దుర్గా దేవికి ఇష్టమైనదే. ఆ రోజున దుర్గను పూజించి ఉపవాసం ఉండి కేవలం పిండిని మాత్రమే స్వీకరించి పూజ చేస్తే సంపదలు కలుగుతాయి. దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకుల పూజ దశమి నాడు చేస్తే పాపం నశిస్తుంది. ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి. ఆ రోజున కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రదం. ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. ఈ తిథినాడే విష్ణుమూర్తి వామనుడై జన్మించాడు. ద్వాదశి నాడు ఆవు నెయ్యిని మాత్రమే స్వీకరించి వ్రతం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.

ధర్ముడు పుట్టిన తిథి త్రయోదశి. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి ఎవరికి నచ్చిన దైవాన్ని వారు ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా పూజ చేస్తే అధిక పుణ్య ఫలం దక్కుతుంది. చతుర్దశి రుద్రుడి జన్మ తిథి. ఈనాడు చేసే రుద్రార్చన గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. యవ, గోధుమల అన్నాన్ని మాత్రమే స్వీకరించి రుద్రార్చన చేయాలి. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ తిథి శివుడికి ఎంతో ప్రీతికరం.

అమావాస్య పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజున దర్భలు, నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే పితృదేవతలు ఎంతో సంతోషించి ఆ తర్పణ మిచ్చిన వారికి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు. పూర్ణిమకు చంద్రుడు అధిపతి. పూర్ణిమ నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజ చేసిన వారికి ధన ధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి.

ఇలా తిథులలో ఒక్కో తిథికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయా దేవతలను ఆరాధించి ప్రత్యేకమైన కోర్కెలు సాధించాలనుకున్న వారు ఆయా తిథులలో పూజలు, వ్రతాలను చేస్తే విశేష ఫలితం ఉంటుందని ఈ కథా సందర్భంలో శ్రీ మహా విష్ణువు భూదేవికి వివరించి చెప్పాడు. ఒక క్రమ పద్ధతిలో అర్చనలు, పూజలు, వ్రతాలు జరగడానికి ఇదెంతో ఉపయుక్తం అనిపిస్తుంది.

మంగళవారం, మార్చి 22, 2016

శ్రీశైలం

పుణ్యక్షేత్రాలు

శ్రీశైలం:

కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు - నల్లమల కొండలు. ప్రకృతి అందాలన్నింటినీ ఈ మహారణ్యంలో దాచుకున్నది. పర్వతారణ్య ప్రాంతంలో శివుడు పదిలంగా సముద్రపు మట్టానికి 458 మీ. ఎత్తున కొండ కొమ్మన వెలసిన, పురాణ ప్రసిద్ధమైన అనాది శివక్షేత్రము. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుండి బస్సులు నడుస్తూవున్నాయి. కొన్నాళ్ళ క్రిందట వరకు జీర్ణావస్థలోనున్నా ఇటీవల ఆలయం పునరుద్ధరించబడింది. కొండపైకి నేరుగా చక్కటి రోడ్ వేయబడి యాత్రికుల సందర్శనార్ధం బహు రమణీయంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయ ప్రశస్తి అనేక విధాలుగా పురాణాల్లో సైతం చెప్పబడినది. 

శ్లో || మైనాకం మంధరం మేరుం | శ్రీశైలం గంధమాదనమ్ 
పంచశైలా పఠేన్నిత్యం | మహాపాతక నాశనమ్ || 

అని కేవల స్మరణ మాత్రంగానే మహాపాతకాలను నిర్మూలించ గలదని ప్రతీతి. 

శ్లో || కేదారే హ్యుదకం పీత్వా | వారణాస్యాం మృత స్తథా 
శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే. 

కేదార క్షేత్రంలోని నీటిని ద్రావినా, కాశీలో మరణించినా, శ్రీశైల శిఖరం దర్శించినా పునర్జన్మం లేదు - అని చెప్పబడింది. ఇంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో మొట్ట మొదటిది. 

ముఖ్యమైన ఉత్సవాలు:
మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానములు. 

శివరాత్రినాటి రాత్రి స్వామి వారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి - 360 మూరల గుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టటం అనీ అంటారు - మంగళపాగా అని అంటారు. ఈ వస్త్రాన్ని రోజుకొక మూర చొ || 360 రోజులు నేస్తారని చెప్పుకుంటారు. మంగళ పాగా రాత్రి వేళ లింగోద్భవ సమయానికి కరెక్టుగా ముగుస్తుంది. పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడట. తరవాత ఈ మంగళపాగాను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు. 

క్షేత్ర వైభవం:
ఇక్కడకు ఇక 3 కి. మీ. దూరంలో కృష్ణా నది ఉత్తార వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అని అంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకు గల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలో వున్న ' లింగాల గట్టు ' వగైరాలను దర్శించుకుని గాని మరలరు. 

ఆలయం చుట్టూ ప్రాకారం గోడలు చాల ఎత్తుగాను వివిధ గోపురాల్తో శోభిల్లుతుంటాయి. ప్రాకారనిర్మాణానికి వినియోగించబడిన రాళ్ళు సుమారు 20 అ. వైశాల్యంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు, రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు - భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగా శివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీ చక్రప్రతిష్ట చేశారని ప్రతీతి. చైత్రమాసంలో ' అంబ తిరునాళ్ళ ' అని గొప్ప ఉత్సవం జరుగుతుంది. 

వెనుక వైపున భ్రమరాంబికాలయంతో పాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.

శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దటమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

చరిత్ర:
ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

వసతి సదుపాయములు:
శ్రీశైలదేవస్థాన సత్రములు. గంగా సదన్, గౌరీ సదన్, శివసదన్ శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ కలవు. ఆంద్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసమునందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది. శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు. శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలు.

శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ఉంటుంది.

భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.

పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి.

వృద్ద మల్లికార్జున లింగము: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది! శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని అంటారు .... ఎందు కంటే ఇది అంత లోతులో వుంటుంది గనుక. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. 

శ్రీశైలం డాం వద్ద పాతాళ గంగ:
2004 లొ పాతాళగంగ కు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడినది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీశైలం "డాం" దిగువన వున్న కృష్ణా నదినే "పాతాళ గంగ అంటారు"
త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. ఇది ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది.

శ్రీశైలం లో కొలువై వున్న సాక్షి గణపతి దేవాలయము:
సాక్షి గణపతి:.ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభించదు. మనం శ్రీ శైలానికి వచ్చి నట్లు సాక్ష్యం వుండాలి. అందు చేత ఈ సాక్షి గణపతిని దర్సించు కుంటే మనం శ్రీశైలానికి వచ్చినట్లు ఈ గణపతి సాక్ష్యం చెపుతాడు. అందు చేత శ్రీ శైలానికి వచ్చిన వారందరు తమ రాకకు సాక్షిగా ఈ సాక్షి గణపతిని దర్శించు కుంటారు. అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు. 
ప్రథాన ఆలయానికి దూరంగా వున్న ఈ ప్రదేశంనుండే శిఖర దర్శనం చేసుకోవాలి
శ్రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; శ్రీ శైలం వెళ్లె దారిలో మధ్య లో ఒక చిన్న గుట్ట వున్నది. ఇంకా చాల దూరంలో శ్రీ శైలం ఉందనగా దారి మధ్యలో ఈ గుట్ట మీద ఎటువైపుకైనా త్రిప్పగలిగే నంది విగ్రహం వున్నది. దాని తలమీద మన కుడిచేతి బొటన వేలు, చిటికన వెలు వుంచి మధ్యలోనుండి దూరంగా అస్పస్టంగా కనబడుతున్న శ్రీశైల ఆలయ గోపుర శిఖరాన్ని అందులోనుంచి చూడాలి. అలా కనబడితే ఇక పునర్జన్మ వుండదని భక్తుల విశ్వాసము. ఈ సౌకర్యము కాలి నడకన వెళ్లేవారికి, లేదా స్వంత వాహనాలలో వెళ్లె వారికె వున్నది. బస్సులు ఇక్కడ ఆగవు. అందు చేత ఈ విషయము కొంత మందికి తెలియ పోవచ్చును.

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ వాలు నుండి కిందికి పడే సన్నని రెండు జల దారలను పంచ దార అని పాల దార అని అంటారు. ఒక దాని నీరు పంచ దార వలె తియ్యగాను, రెండోదాని లోని నీరు పాల రుచి కలిగి వుంటుంది.

ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం
అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు.

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.

శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:
రోడ్డు మార్గములు హైదరాబాదు నుండి శ్రీశైలం 200 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి. గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

రైలు మార్గములు:
భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.

విమాన మార్గములు:
హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై బస్సు ద్వారా చేరవచ్చు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...