హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

పరాక్రి వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరాక్రి వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, ఏప్రిల్ 16, 2015

మన ఆచార-సాంప్రదాయాలు

మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము.

•    శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
•    ఒక గన్నేరు పూవువెయ్యి జిల్లేడు పూలతోమానం.ఒక మారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానం
•    ఒకతామరపూవువెయ్యిమారేడుదళాలసమానం.ఒక పొగడపూవువెయ్యితామరపూవులతోసమానం.
•    ఒకములకపువువెయ్యిపొగడపూవులతోసమానంఒకతుమ్మిపూవువెయ్యిములకపువులతోసమానం.
•    ఒకఉత్తరేణిపూవువెయ్యితుమ్మిపూలతో సమానం.ఒక  ఉత్తరేణి పూవు వెయ్యి పొగడపూవులతో సమానం.
•    ఒక దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతో సమానం.ఒకజమ్మిపూవువెయ్యిదర్భపూులతో సమానం.
•    ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతో సమానం.వెయ్యి నల్లకలువ పూవులతోచేసిన మాలను శివునికి సమర్పిస్తారో వారుకైలాసంలో నివసిస్తారు.
•    మొగిలి -మాధవిమల్లి {మల్లె కాదు }అడవిమల్లి -సన్నజాజి - ఉమ్మెంత -దిరిసెన-సాల-మంకెనపూవులనుశివ పూజలో వాడరాదు.మిగిలిన పూవులను శివ పూజలో వాడవచ్చు.
•    విష్ణు పూజకు సన్నజాజి, మల్లె, అడవిమొల్ల, పులగురివిందా, కలిగొట్టు, గన్నేరు, దేవకంచన, తులసి, గులాబీ, పసుపు, గోరంట, సంపెంగ, దింతెన, అశోక, మొగిలి, నాగ కేసర, జమ్మి పుష్పములు శ్రేష్ట్రమయినవి.
•    ఒక తుమ్మి పూవుతో పూజించిన పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
•    వెయ్యి తుమ్మి పూల కంటే ఒక చండ్రపూవు వెయ్యి చండ్రపూవుల కంటే ఒక జమ్మి పూవు, వెయ్యి జమ్మి పూవుల కంటే ఒక మారేడు దళం, వెయ్యి మారేడు దళాల కంటే ఒక అవిసె పూవు, వెయ్యి అవిసె పూవులకంటే ఒక నందివర్ధనం, వెయ్యి నంది వర్ధనాల కంటే ఒక గన్నేరు పూవు, వెయ్యి గన్నేరుల కంటే ఒక సంపెంగ, వెయ్యి సంపెంగలకంటే ఒక అశోక పుష్పము, వెయ్యి అశోక పుష్పముల కంటే ఒక తెల్లగులాబి, వెయ్యి తెల్లగులాబిల కంటే  ఒక పచ్చ గోరింట, వెయ్యి పచ్చగోరింటలకంటే ఒక తెల్లని సన్నజాజి ఇలా మూడుదొంతరల మందారము, కుందము,పద్మము, తామర, మల్లె, జాజి పూవులు విష్ణు పూజకు శ్రేష్ట మైనవి.
•    వెయ్యి జాజి పూవులతో మాల గుచ్చి విష్ణువుకు అలంకరించినవాడు విష్ణువు  దగ్గరే నివసించును. అన్ని పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసిదళముతో పూజించిన వచ్చును.
•    మందారము, జిల్లేడు, ఉమ్మెత్త ,బూరుగ, దేవకాంచన మొదలగు పూవులు విష్ణు పూజకు పనికిరావు.
శివ పూజ, విష్ణు పూజకు వాడవలసిన పూల గురించి  ఇంతకముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవి పూజకు  కావలసిన పూవుల  గురించి  చెప్పుకుందాం.
పూలమాలలు కట్టుట 64 కళలలో ఒకటి.  వివిధ వర్ణములు వివిధ జాతులకు చెందిన పుష్పములతో కలగలిపి కట్టిన మాలలు మూడు రకములు:
1.    హృదయము వరకే ఉండే పొట్టి మాలలను రైక్షికములు అంటారు ఈ మాలలు ఆనందమును కలిగిస్తాయి.
2.    నాభి (బొడ్డు) క్రిందకు ఉండే మాలలు సాధారణియములు. ఈ మాలలు ఆనందమును రెట్టింపు చేస్తాయి.
3.    పాదపద్మములపై పడే వానిని వనమాల అంటారు. ఇది అన్ని మాలల కన్నా ఉత్తమమైనది.
మాలలు - యాగ/పుణ్య ఫలాలు
•    గన్నేరు,పొగడ,దమనం,నల్లకలువ,తామర,సంపెంగ,జాజి మొదలగు పూలతో కట్టిన మాలలు రైక్షికములైనా అమ్మకు చాలా ఇష్టం. మారేడు దళములతో అల్లిన రెండు దండలను అమ్మకు అర్పించిన రాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
•    సుగంధ పుష్పములను విడిగా కాని, మాలలు కట్టికాని అమ్మవారిని  పూజించిన అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది.
•    పొగడ పూలతో మాల కట్టి అమ్మవారికి సమర్పించిన వాజిపేయ యాగం చేసిన ఫలితం దక్కుతుంది.
•    తుమ్మి పూల దండతో  అమ్మను పూజించిన కానిరాజసూయ యాగా ఫలితం దక్కుతుంది.
•    జమ్మి పూల దండతో అర్చన చేసిన వెయ్యి గోవులను దానమిచ్చిన ఫలితం దక్కుతుంది.
•    రెళ్ళు పూల దండతో అర్చన చేసిన పితృ లోకాలు కలుగుతాయి.
•    నల్ల కలువ పూల దండతో అర్చన చేసిన దుర్గాదేవికి ప్రియ భక్తుడై రుద్రలోకంలో  నివసిస్తాడు.
•    మారేడు దళ దండతో పూజించిన లక్ష గోవులను  దాన మిచ్చిన ఫలితం దక్కుతుంది.
•    అమ్మవారికి అన్ని పూవుల కంటే మారేడు దళములంటే  అత్యంత ప్రీతి. రాత్రి పూట కడిమి పూలతోను ఇరు సంధ్యల యందు మల్లికలతోను మిగిలిన సమయమందు మిగిలిన అన్ని పువులతోను అమ్మను పూజించవచ్చు.మహాలక్ష్మి అమ్మవారినిఅన్ని పూలతో పూజింపవచ్చు. కాని తులసి, గిరింత, దేవ కాంచన, గరికతో పూజింపరాదు.
•    దుర్గాదేవిని అన్ని పూలతో పాటు జిల్లేడు మందారములతో పూజింపవచ్చు.
•    దుర్గ, లక్ష్మిలకు తప్ప ఇతర దేవతలెవ్వరికీ జిల్లేడు, మందారములతో పూజింపరాదు
•    దుర్గాదేవిని మల్లె,జాజి,అన్ని రకముల తామరలు, గోరింట, సంపెంగ, పొగడ, మందారం, గన్నేరు, జిల్లేడు, దవనం, మరువం, లేత గారిక, దర్భ పూలు, రెళ్ళు పూలు, మారేడు దళములు, అన్ని విధాల పూవులతోను, ఆకులతోనూ పూజింప వచ్చును.
•    పూలు దొరకని రోజులలో ఆకులతో పూజింప వచ్చును.
•    నేలపై, నీటిలో పుట్టిన సుగంధ పుష్పాలను అమ్మ ప్రీతితో స్వీకరిస్తుంది. కాని ఆ పూలను భక్తితో సమర్పించాలి.
పైన చెప్పబడిన పూలతో అమ్మను భక్తీ శ్రద్దలతో పూజించిన అమ్మ మన సమస్త కోరికలు తీర్చును. సంపెంగ, మల్లె, జాజి, తామర, కలువ, మరువం, దవనం మొదలగు పూలతో పూజించిన పుణ్యం నూరు రెట్లు అధిక మగును.
అమ్మవారికి మొగ్గలు, పక్వం కాని పండ్లు, అకాల పక్వ పండ్లు, పురుగు తొలచిన పూలు, పండ్లు నివేదించరాదు. తెలియక అత్యంత భక్తితో  నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించినా భక్రి ఒక్కటే అమ్మ స్వికరించును. తెలిసి కావాలనే, అశ్రద్దతో నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించిన అమ్మ ఆగ్రహించును.
జాజి పూలతో భుక్తి, మల్లెతో లాభము, నల్ల కలువతో బలము, పద్మము శాంతిని ,ఆయుర్వృద్దిని, కమలము సుపుత్రులను, వరి వెన్ను సౌభాగ్యమును, సన్నజాజి వాక్శుద్ధిని, నాగ కేసరము రాజసము, సంపెంగ బంగారమును, మొల్ల కీర్తిని, కలువ కవిత్వాన్ని, మరువము విజయప్రాప్తిని, గరిక ధనధాన్యసంపదను, మోదుగ పూలు పశు సంపదను వృద్ధి చేయును. తెల్లని పూలు సామాన్య కోరికలు తీర్చును.
అమ్మవారిని ఒక నెల జపా పుష్పములచే పూజించిన అమ్మవారి అనుగ్రహము కలుగును.తెల్లని పూలతో ఒక నెల పూజించిన ముప్పది జన్మల పాపం నశించును. మంకెన పూలతో ఒక నెల పూజించిన సర్వ పాపములు తొలగి పోవును తామర పూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసన్నబుద్ధితో పూజించిన అన్ని పాపములు నశించి మంత్రి పదవి పొందుదురు. మల్లె, జాజి, తెల్ల కలువ, తామరలతో ఒక నెల పూజించిన వంద జన్మల పాపం తొలగును. బ్రహ్మ హత్యా పాతకం తొలగును. వాక్శుద్ధి కలుగును.
పూజించు పూల యందు వెంట్రుకలు  ఉన్న మానసిక వ్యాధులు కలుగును. పురుగులు కలగిన పూలు ఉపయోగించిన రాజ దండనము, మహా భయము కలుగును. అందుకని అమ్మవారికి ప్రియమైన పూలను ఉపయోగించి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుదాం.
     
ॐॐ ॐ ॐ  శుభమస్తు ॐॐ ॐ ॐ



బుధవారం, నవంబర్ 27, 2013

రోగ, దారిద్ర్యాలు తొలగిపోవాలంటే…

                             

దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ 1 ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశానం 2 మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ 1 స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవ”2

                    అనే ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే....... ఐదు సంవత్సరాల అఘఘర్షణ స్నానఫలం లభిస్తుంది. సూర్యుడు మకరంలో ఉండే సమయం (మాఘమాసంలో) సూర్యోదయానికి ముందు ఇంట్లోనే స్నానం చేస్తే ఆరు సంవత్సరాల అఘఘర్షణ స్నానఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

                                   అదే మాఘమాసంలో బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యస్నాన ఫలాన్ని, మహానదీ సంగమ స్నానం చేస్తే చతుర్గణం, గంగా యమునా సంగమ (త్రివేణీ సంగమ) స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని పండితులు అంటున్నారు.మాఘ మాసంలో ప్రతినిత్యం మాత్రమే కాకుండా మాఘమాస పాడ్యమి, విదియ, తదియ తిథులలో పై శ్లోకాన్ని ఉచ్చరించి, పిదప స్నానం చేయడం ఆరోగ్యదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
                                 ఇంకా.. మాఘమాసాల్లో వచ్చే ఆదివారాల్లో నియమబద్ధంగా సూర్యభగవానుడికి క్షీరాన్నం వండి నివేదించితే రోగ, దారిద్యాలు తొలగిపోతాయి. మాఘమాసపు ఆదివారాల్లో మాంసం, ఉల్లి, వెల్లుల్లి తినడం కూడదు. అదేవిధంగా మాఘమాసం పూర్తిగా ముల్లంగి ఆహారంగా తీసుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి.

సోమవారం, మార్చి 18, 2013

హైందవ సాధనారాధన

                                     హైందవ  సాధనారాధన                                           P.V.RADHAKRISHNA (PARAKRI ) CELL -   9966455872
    
శో||   ఓం గణేశ  గ్రహనక్షత్రాణి యోగినీ రాశిరూపిణీం |
       దేవీం మంత్ర మయీం నౌమి మాతృకాం పరమేశ్వరీం ||

           ప్రణవనాదము  "ఓం
" కార రూపమై  గణ,ఈశ,గ్రహ,నక్షత్ర,రాశి, యోగినీ రూపమున  మరియు మంత్ర , తంత్ర రూపమున ఏ మహత్తర శక్తి జగత్తునందంతటా మాతృకా రూపమై ఏకమనేక అగుచు పూర్ణమైనిండి యున్నదో ఆ పరమేశ్వరికి నమస్కరించుచున్నాను.
 ఉ||   ఏమహనీయ శక్తి పరమేశ్వర బ్రహ్మముకుందులందు తా
       సాముగ వర్తిలింగ పృధుశక్తి చరాచర విశ్వ వృత్తి సం
       గ్రామ లయంబు సృష్టి పరి రక్షణ లొప్పగ వారు జేతురో . . . ?
       నీమము తోడ నామె భువనేశ్వరి నే శరణంబు వేడెదన్ ||    ( స్వకీయము )

      దైవీయ భావ చరిత్ర :-    మానవావిర్భావముతో సమాంతరంగానే దైవీయభావము ఆవిర్భవించింది. చరిత్ర పుటల్లో మానవేతిహాసపు జాడలు తెలియవచ్చే నాటికే దైవీయభావ చరిత్ర ప్రాధమిక ప్రకరణాలు పూర్తిచేసుకుంది. పచ్చని చెట్లు... పరిమళించే పూలు, విరిసిన వెన్నెల, మేఘ మాలికల మాటున తళుక్కున మెరిసే మెరుపులు, చిక్కని చీకట్లో ఆశారేఖల్లా మిలమిల మెరిసే నక్షత్రాలు,ఇలా ఎన్నో ప్రకృతి మనోహర దృశ్యాలు అలనాటి ఆదిమానవుని- ఆహ్లాద పరచాయి-ఆశ్చర్య పరిచాయి. పరిశీలింప ఆలోచింపజేసాయి. ఊహ తెలిసిన మానవుడు ఉత్సాహవంతంగా నాటినుండి నేటి వరకు... ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ప్రకృతి ఇలా క్రమ బద్ధంగా ఎలా ఉంది.   
  
   మండే ఎండలు,వడగాడ్పులు,పెను తుఫానులు,వానలు-వరదలు,భూకంపాలుఇలాంటి ప్రకృతి భీభత్సాలు మానవజాతిని భయకంపిత విహ్వలుని చేస్తూనే ఉన్నాయి. మొదట ప్రకృతి అందాలకు పులకించాడు ఆనందించాడు, ప్రకృతి ప్రసాదిత వస్తుసంచయ సమృద్ధికి గర్వించాడు.ప్రకృతి ప్రళయ కరాళా విలయాలకు నశించాడు కృశించాడు.ఎన్నో ఉత్పాతాలనుండి తాను రక్షణ పొందాలనే తలంపుతో ఏ కొద్ది సాధన చేసినా తన ఆలోచనామృతానికి పరవసిస్తూ సుఖించాడు. తన ఆలోచనలే పరిశీలనలకుపునాదిరాళ్ళుగా ప్రకృతినించి తెలుసుకుని వికృతిని కల్పించుకుని మురిసిపోయాడు. అదిగో ఆ ఆలోచనా భావ స్రవంతిలో భౌతిక సుఖవాదము-దైవీయభావము కవల పిల్లల్లా జన్మించాయి.
                 
                    ప్రకృతి ప్రసాదిత వస్తులోహ సంచయముతో శీతోష్ణాదులనుండి రక్షించుకుని పర్ణశాలనుండి పదంతస్థుల భవనం వరకు నిర్మించుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదిత వస్తు సంచయానికి--- స్థల-కాల-రూపోపయుక్తత కల్పించుకోవడామే మానవ విఙ్ఞానం భౌతికశాస్త్రంగా పరిఢవిల్లింది. శాస్త్రాన్వేషణా ధ్యేయం ప్రకృతి నుండి తనను తాను కాపాడుకోవడం,రక్షణ పొందడం,సుఖానుభూతి పొందడమే.ఐతే గొప్ప తిరకాసంతా ఇక్కడే ఉంది.ఆకలిబాధకి తట్టుకోలేక తిన్నాడు,దాహపు బాధకి తట్టుకోలేక తాగాడు, శారీరక సౌఖ్యాలకై తహతహపడి స్త్రీ పురుషులు సంగమించారు.బాధానివారణమే సౌఖ్యమని భ్రమించారు.భౌతిక వాదము ఇచ్చే సుఖము ఆధ్యాత్మిక వాదుల అంతరంగము వేరువేరై పేరుకున్న అభిప్రాయాల బేధాన్ని కల్పించాయి.మరి ఆధ్యాత్మికవాదుల భావనచూస్తే........
                     
                            ఈ ప్రకృతి ఇలా లయబద్ధంగా ఎందుకు నడుస్తోంది? దీనిని ఇలా నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏది? భౌతిక శాస్త్రాలు ఎంత అభివృద్ధి పరుచుకున్న కాల పరిధిలో అవిఅరిగి విరిగి పోతున్నాయి.భౌతికశాస్త్ర వస్తు సంచయంతో పొందలేని రక్షణ ఆ అదృశ్యశక్తి నుండిపొందగలగాలని పరిశీలింప కృషిచేసారు.అదే దైవీయ భావనకు అంకురార్పణ అయ్యింది.                 
       మానవ చరిత్రలో పలుమార్లు భౌతిక-ఆధ్యాత్మిక వాదాలు తమదే పైచేయంటూ పరుగు పందాలు తీసాయి.ఈ దైవీయ భావమే పలు దేశాల్లో అనేక మతాలుగా వెల్లివిరిసింది.కాబట్టే మానవ చరిత్రలో మతం కూడా అనేక కల్లోలాలుసృష్టించింది.రాజ్యాల స్థాపనలో మత యుద్ధాలు,కులాల కుమ్ములాటాలు కోకొల్లలు.చరిత్ర ఇలా ఎంత కాలమైనా అనంతంగా సాగుతునే ఉంటుంది.
హిందూమతం - ఓ పరిశీలన :-  ఆరాధన అంటే? తాను నమ్మిన దైవాన్ని ప్రేమించడమే, ప్రేమించి సేవించడమే. దీనిచే భక్తి,విశ్వాసము,సేవానిరతి,మనోవికాశము కలుగుతాయి.

శ్లో ||   స్త్రీ రూపం చింతయేత్ దేవీం - పుం రూపంవా విచింతయేత్ |
       అధవా నిష్కళం ధ్యాయేత్ - సచ్చిదానంద లక్షణమ్||                          
         ఆకార,వికార,విచార,విదూరము-లింగ,పురుష,వచన,విభక్తిఅభేధ్యము అగునది భగవత్ స్వరూపము. అట్టి సచ్చిదానందమూర్తి (భూమ) శబ్దోక్తము. నిరాకార సచ్చిదానంద స్వరూపముగా విరాట్ నర్చించుటయే మేలు అదే తపస్సు. దీనికి ఎంతో మనో ధృఢత్వము నిగ్రహము కావాలి కావున అందరూ తపస్సులు కాలేరు కదా.  
                  
         మనో నిగ్రహం సాధించడానికే విగ్రహారాధన పరికల్పితమైనది. ఏ రూపూ చేని దేవునకు అనేక రూపములు, ఏ పేరూ లేని దేవునికి శతకోటి నామములు. మరలా మధ్యలో మన సంకల్పములు,మన కాల్పనికతకు తగ్గట్టు ముక్కోటి దేవతా మూర్తులు. విఘ్నములు కలుగకుండా విఘ్నేశ్వరుని పూజలు,ధనము కావాలంటూ లక్ష్మీ కుబేరులను,ఇలా మన కోర్కెలకు అనువైన దేవతలకు అనువుగా సృజింపబడిన ఆగమోక్తములు. ఐనా ప్రకృతిలో గల అణువణువునూమన హైందవ సంప్రదాయము దైవముగనే తలచినది.నమక చమక రుద్ర సూక్తములుసైతము పై భావనను ప్రకటించుచున్నవి.ఒక్క మాటలో చెప్పాలంటే హైందవ జీవన శైలిలో మిళితమై ఆధ్యాత్మికా
భావము సర్వ పల్లవ పులకితము. మన్మతః సమ్మతః తత్ మతః అను భావముతో అనేక బోద్ధలు అనుయాయులు హైందవ ధర్మమున గలరు.హిందూ మతము అనుట
తప్పు. హైందవ దేశమున ఎన్నియో మతములవారు తమ భావజాల సంచయమును యుగధర్మానుసారము మనుగడింప జేసిరి.
   మ||  ధన తంత్రమ్మున గణ్యతన్ బడయగా తంత్రఙ్ఞుడన్ గాను, క
        మ్మని మంత్రమ్ముల భక్తితో గొలువగా మంత్రఙ్ఞుడన్ గాను, నూ
        తన యంత్రమ్ముల నిన్ను జేర జన శాస్త్రఙ్ఞుండనే గాను, నీ   
         యను రాగాంబుధి ముంచి తేల్చగదవో? అఙ్ఞుండ నన్ బ్రోవవో?  (స్వకీయము)

             శ్లో//  నిర్గుణా సగుణా శ్చేతి - ద్వివిధా ప్రోక్తమనీషిభిః /
                   సగుణారాగి భిస్సేవ్యా - నిర్గుణాతు విరాగిభిః //
       కామ్యులగు మానవులు సగుణ రూపమున, నిష్కాములు నిర్గుణ రూపమున
భగవంతుని సేవించుచున్నారు. కామ్యాకామ్య సంకల్పమే కర్మ ముక్తి మార్గ ప్రేరకమై యున్నది.
వివిధారాధలు:-  ౧. మనస్సున స్థిర సంకల్పముతో విశ్వసించుట మానసిక ఆరాధము.ఇందు భౌతికవస్తుచయము అనగా ధూప, దీప, నైవేద్యాదికములు నామమాత్రములు.
౨, వాక్కు:- భగవన్నామమును నోటితో పలుకుట భజించుట వాక్కు.ఈ ప్రక్రియనందు భజన,కీర్తన,మంత్రజపాదులు ప్రాధాన్యత వహించును.
౩. కాయము:- శరీరావయవములు కదల్చి, యోని ముద్రాదుల దాల్చి, ధూపదీప నైవేద్యములర్పించి జపతప హోమాదులు చేయుట ప్రాధాన్యత వహించును.
౪.కర్మలు:- పూజ,జపము,హోమము,తర్పణము,మార్జనము,బ్రాహ్మణ భోజనాదులనే షడంగములు  నిర్వర్తించుట ప్రధానమై యుండును.  మనోవాక్కాయ కర్మంబుల ప్రబల విశ్వాసముతో తాను నమ్మిన దైవమును కొల్చుటయే ఆరాధన.

     ఉ||   శ్రీగిరిజా సరస్వతుల చిన్మయరూపిణి లోకమాతకున్
           రాగిణి విష్ణు చేతనకు రాసవిలాస విహారలోలకున్
           భాగవిభాగ రాశినత భాసిత సర్వగ్రహాది మూర్తికిన్
           సాగిలి మ్రొక్కెదన్  జయము సౌఖ్యము గూర్పగ విశ్వశక్తికిన్ || (స్వకీయము)

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...