హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, జనవరి 02, 2013

నందికేషుని నోము


            పూర్వము ఒకానొక గ్రామంలో ఒక వృద్ద పెరంటాలుండేది.    ఆమె చేయని వ్రతాలు నోచని నోములు లేవు.  కాని ఆమెకు మాట కటువుగా   వుండేది.  చెట్లలో చీత్కారం చోటుచేసుకునేది.  ఆ కారణం వల్ల ఆ గ్రామస్తులేవ్వరికి ఆ ముడుసలిపట్ల ఉండవలసిన ఆదరాబిమానాలు ఉండేవి కావు.  కాని ఆమెను ఎవరూ దూషించేవారు కాదు .   సమస్త దేవతలా కరుణా కటాక్షాలతో ఆమె జీవితం సజావుగా సాగిపోతుండేది.  
          ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లోకంలో జరిగే విషయాలు విశేషాలను ముచ్చటించు కుంటున్నారు  .  పార్వతి పరమేశ్వరుని కాళ్ళు వత్తుచున్నది.   ఆమె చేతులు కఠినముగా ఉన్నందువల్ల పరమేశ్వరుడు ఆమెను పాదాలను పట్టవద్దన్నాడు.  నాదా!  నా చేతులెందుకు కఠినముగా వున్నాయో ఈ కాఠిన్యం పోయి మృదువైయ్యే మార్గామేమితో హేప్పమని వేడుకుంది.  దేవి నీవేవరిపట్లనో కాఠిన్యము పోయి మృదువైయ్యే మార్గమేమిటో  చెప్పమని వేడుకుంది.  దేవి నేవేవరిపట్ల నో కాఠిన్యముగా ఉండడమే ఈ నీ చేతులు ఠినత్వమునకు గల కారణం ఇందుకు నీవు నీళ్ళాట రేవుకు వెళ్లి వచ్చీపోయే వనితలకు తలంటి నీళ్ళు పోయవలసిందని ఇందువాళ్ళ ఒక భక్తురాలికి తలంటి నీళ్ళు పోయడం వల్ల స్నానం చేయిన్చేదవో వారికి గల కాఠిన్యము కూడా నశించి పోవునని పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించాడు.  
            ఆమాటమేరకు పార్వతి భూలోకానికి వచ్చి నీళ్ళాట రేవు వద్ద నిలబడి వచ్చీపోయే మగువలను పిలచి తలంటి నీళ్ళు పోస్తూ వచ్చింది.  అలా వచ్చినవారందరికీ తలంటు పోయగా అహంకారవతియై ఒక వృద్ద పేరంటాలు రేవుకు వచ్చింది.  పార్వతి ఆమెను తలంటి నీళ్ళు పోస్తాను రమ్మన్నది.  నేను ఎన్నో వ్రతాలు హేసాను ఇదేమి వ్రతము?  తలారా స్నానం చేయవచ్చిన నాకు తలంటుతానంటే కాదనడం ఎందుకు అని అలగేకాని  తలవంచుకుని కూర్చున్నది ఆ ముదుసలి పేరంటాలు.  పార్వతి ఆమెకు తలదిద్ది స్నానం చేయించి సాగనంపింది.  ఆ ముదుసలి వెళుతూ కనీసం పార్వతీ దేవిని మర్యాద కోసమైనా మన్నింపు మాటలతో తనియింప చేయలేదు.  అయినా పార్వతి తన చేతులు మరుడువుగా మారడం వల్ల ఆ ముదుసలి పెరంటాలిని అనుగ్రహించి సిరిసంపదలు ప్రసాదించింది.  
             పలు నోములు నోచితినన్న అహంకారం ధనదాన్యాది సిరులున్నాయన్న అహంభావం ఆ వ్రుద్దురాలిలో కలిగాయి.  తనంతటి దానను కనుకనే పార్వతి  స్వయంగా వచ్చి తలారా స్నానం చేయిన్చిందన్న గర్వం కలగడంతో ఆమె అందరి పట్ల చులకనగా ప్రవర్తిస్తుండేది.  ఈ విషయాన్ని గమనించిన పార్వతి ఆమె సిరులే ఆమె అహంకారానికి కారణమని సిరిని తొలగిస్తే ఆమె స్థిరపడుతుందని నిశ్చయించుకుంది.  విఘ్నేశ్వరుడ్ని పిలిచింది.  ఆమె అహంకారాన్ని వివరించి ఆమె భాగ్యాన్ని తీసివేయవలసిందని చెప్పి పంపించింది.  ఆమె ఇంటికి గణపతి వెళ్ళాడు.  ఆమె విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు పెట్టింది.  పార్వతి పుత్రుడు ప్రసన్నుడై ఆమెకు మరికొంత సిరిని అనుగ్రహించాడు.  
             ఈ సంగతి తెలిసిన పార్వతి బాగా ఆలోచించి నందిని ఆమెవద్దకు పంపించింది వచ్చిన నందిని ఆ వృద్ద పేరంటాలు ఆరాధించి శనగలు వాయనమిచ్చింది.  దానితో నందికేశ్వరుడు ఆమెకున్న భాగ్యాన్ని తీయకుండా వెనుదిరిగి పోయాడు. ఆ తదుపరి పార్వతి భైరవుడ్ని పంపించింది.  వచ్చిన భైరవునకు వృద్ద పేరంటాలు గారెలు పెట్టింది.  అందుకా భైరవుడు ఆమె సిరులు తొలగించకుండా వేణు తిరిగి వచ్చెను.  పార్వతి చంద్రుడిని పంపించింది.  వచ్చిన చంద్రునకు వృద్దురాలు చలిమిడి చేసి పెట్టింది.  చంద్రుడు ఏ విధంగాను ఆమె సిరులు తొలగించకుండా వెను తిరిగెను.  
               అటుపై పార్వతి సూర్యుడిని పంపించగా ఆ వృద్దురాలు క్షీరాన్నాన్ని ఆరగించమని పెట్టింది.  అందుకా సూర్యుడు ప్రసన్నుడై ఆమె సిరులపట్ల ఏవిధమైన చర్య తీసుకోలేదు.  కుమారస్వామిని వృద్దురాలి సిరులు తొలగించుటకు  పార్వతి పంపించగా చక్రపోగాలిని పెట్టి వృద్దురాలు తన ప్రమాదాన్ని తప్పించుకుంది.    వీరివల్ల సాద్యం కాదని సిరులను తొలగించుటకు పరమేశ్వరుడిని పంపించింది పార్వతి.  వచ్చిన సదాశివునికి ఆ వృద్ద భక్తురాలు చిమ్మిలిని పెట్టింది.  శంకరుడు వచ్చిన పని కాదని వెను తిరిగి వెళ్ళాడు.  
                ఇంకా పార్వతీ దేవి స్వయముగా తానె కార్యసాధన నిమిత్తం వృద్ద పేరంటాలు ఇంటికి వచ్చింది.  తన ఇంటికి వచ్చిన పార్వతిదేవిని సాదరంగా ఆహ్వానించి పీఠంవేసి  కూర్చోబెట్టి భక్తురాలు పసుపు వ్రాసింది.  కుంకుమ బొట్టు పెట్టింది.  ధూప దీప నైవేద్యాడులతో ఆరాధించింది.  పులగం వండి నివేదించింది.  పార్వతీ దేవి ప్రసన్నురాలై తన నిర్ణయాన్ని విరమించుకుంది ఆమె కాఠిన్యము తగ్గింది.  మనస్సు తనువూ మ్రుదువైయ్యాయి.  ఆమెకు మరింత సిరిసంపదలను ఆగ్రహించింది.  
                ఓ భక్తులారా!  నీవు నేను పంపించిన దేవతలకు నివేదించిన పదార్ధాలు నివేదించి పూజాపూర్వక ఉద్యాపన చేసిన వారికి సమస్త దేవతల అనుగ్రహం కలిగి కాఠిన్యము తొలగి పటుత్వంగా రూపొంది సమస్త సిరులు సమస్త భోగాలు కలుగుతాయని పార్వతి వచ్చింది. 
ఉద్యాపన:  కొద్ది కొద్దిగా నవ ప్రసాదాలను చేయాలి.  పార్వతీదేవిని ఆరాధించాలి ప్రసాదాలను నంది తదితరులకు నివేదించాలి.  అయిదు మానికల బియ్యం అత్తెసరుగా వండి ఇదుమూరాల అన్గావస్త్రముతో మూటగట్టి వెండితో చేసిన నందికి నివేదించి అత్తెసరును బంధువులకు వడ్డించాలి. దక్షిణ తామ్బూలాడులతో ఒక సద్బ్రామ్హమనులకు స్వయం పాకం ఇవ్వాలి.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...